Girl Suicide Letter: పెళ్లి చెడగొట్టారని.. యువతి సూసైడ్ నోట్ రాసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Girl Left House After Writing Suicide Letter In Nirmal Dist: ‘‘శతృవులు ఎక్కడో ఉండరురా, మన చుట్టుపక్కలే ఉంటారు’’ అని ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. మంచివాళ్లుగా నటిస్తూ మన చుట్టూ తిరిగే వ్యక్తులే మన చెడుని కోరుకుంటుంటారు. అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం మన ఎదుగుదలని చూసి ఓర్వలేరు. ఎలాగోలా దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ తాజా ఉదంతం. పాపం ఆ యువతి.. పెళ్లి చేసుకొని, హ్యాపీగా దాంపత్య జీవితాన్ని గడుపుదామని కలలుకంది. కానీ, తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులే ఆమె కలల్ని నాశనం చేశారు. ఆమె పెళ్లిని చెడగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆ అమ్మాయి.. సూసైడ్ నోట్ రాసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Sania Mirza: సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్.. చివరి మ్యాచ్ను చూసేందుకు వచ్చిన స్టార్స్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి.. ఒక కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. ఆ కంప్యూటర్ సెంటర్ పక్కనే ఉన్న ఫోటోషాప్ యజమాని వంశీ, అతని భార్యతో ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. దాంతో వాళ్లు స్నేహితులుగా మారారు. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆ యువతి వారితో పంచుకుంది. కట్ చేస్తే.. ఫిబ్రవరిలో ఆ యువతికి ఒక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం తేదీని కూడా ఖరారు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని క్యాన్సిల్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి.. ఒక సూసైడ్ నోట్ రాసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి వంశీ దంపతులు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పారని.. వాళ్లే తన పెళ్లిని చెడగొట్టారని అందులో పేర్కొంది. తాను ఇళ్లు వదిలి వెళ్లిపోవడానికి వంశీ దంపతులే కారణమని తెలిపింది.
Water Pipeline Bursts: నీటి ఒత్తిడికి బద్దలైన పైప్లైన్.. ముక్కలైన రోడ్డు
ఈ సూసైడ్ నోట్ తీసుకొని.. కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. వంశీ దంపతుల కారణంగా తన అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయిందని, దాంతో మనోవేదనకు లోనై ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశారు. వంశీ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీరుమున్నీరు అయ్యారు. వారి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. ఆ యువతి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లిందని గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!