Girl Suicide Letter: పెళ్లి చెడగొట్టారని.. యువతి సూసైడ్ నోట్ రాసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Girl Left House After Writing Suicide Letter In Nirmal Dist: ‘‘శతృవులు ఎక్కడో ఉండరురా, మన చుట్టుపక్కలే ఉంటారు’’ అని ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. మంచివాళ్లుగా నటిస్తూ మన చుట్టూ తిరిగే వ్యక్తులే మన చెడుని కోరుకుంటుంటారు. అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం మన ఎదుగుదలని చూసి ఓర్వలేరు. ఎలాగోలా దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ తాజా ఉదంతం. పాపం ఆ యువతి.. పెళ్లి చేసుకొని, హ్యాపీగా దాంపత్య జీవితాన్ని గడుపుదామని కలలుకంది. కానీ, తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులే ఆమె కలల్ని నాశనం చేశారు. ఆమె పెళ్లిని చెడగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆ అమ్మాయి.. సూసైడ్ నోట్ రాసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Sania Mirza: సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్.. చివరి మ్యాచ్ను చూసేందుకు వచ్చిన స్టార్స్
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి.. ఒక కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. ఆ కంప్యూటర్ సెంటర్ పక్కనే ఉన్న ఫోటోషాప్ యజమాని వంశీ, అతని భార్యతో ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. దాంతో వాళ్లు స్నేహితులుగా మారారు. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆ యువతి వారితో పంచుకుంది. కట్ చేస్తే.. ఫిబ్రవరిలో ఆ యువతికి ఒక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం తేదీని కూడా ఖరారు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని క్యాన్సిల్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి.. ఒక సూసైడ్ నోట్ రాసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి వంశీ దంపతులు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పారని.. వాళ్లే తన పెళ్లిని చెడగొట్టారని అందులో పేర్కొంది. తాను ఇళ్లు వదిలి వెళ్లిపోవడానికి వంశీ దంపతులే కారణమని తెలిపింది.
Water Pipeline Bursts: నీటి ఒత్తిడికి బద్దలైన పైప్లైన్.. ముక్కలైన రోడ్డు
ఈ సూసైడ్ నోట్ తీసుకొని.. కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. వంశీ దంపతుల కారణంగా తన అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయిందని, దాంతో మనోవేదనకు లోనై ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశారు. వంశీ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీరుమున్నీరు అయ్యారు. వారి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. ఆ యువతి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లిందని గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!