TS SSC Exams: విద్యార్థులకు శుభవార్త.. 50 శాతం ఛాయిస్ ప్రశ్నలేనట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు శుభావార్త చెప్పింది. కరోనా కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడం, ఆన్లైన్ క్లాస్లు నిర్వహించడం లాంటి కారణాలతో విద్యాశాఖ 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాబోయే ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022లో విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పలు చేశారు. “మొత్తంమీద, ఈ సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షలలో ప్రశ్నలలో 50 శాతం ఛాయిస్ ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఒక అధికారి తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఎస్ఎస్సీ పరీక్షలు 2022 అన్ని సబ్జెక్టులలో మొత్తం సిలబస్లో 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయి. సాధారణ 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి.
పరీక్షలు మే 11న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్ A), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు) మరియు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు)తో ప్రారంభమవుతాయి. SSC పరీక్షలు మే 17న సోషల్ స్టడీస్ పేపర్తో ముగుస్తాయి. OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం & అరబిక్), OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం & అరబిక్) మరియు SSC వొకేషనల్ కోర్సు (థియరీ) వరుసగా మే 18, 19 మరియు 20 తేదీల్లో జరుగుతాయి. పరీక్ష ముగిసిన 30 నిమిషాల్లో అన్ని సబ్జెక్టుల్లోని ఆబ్జెక్టివ్ పేపర్లకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఇప్పటి వరకు 4.81 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14తో ముగియగా, విద్యార్థులు పరీక్ష రుసుమును రూ. 50 మరియు రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 వరకు మరియు మార్చి 4 వరకు చెల్లించవచ్చు. రుసుము కూడా రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు ఆమోదించబడుతుంది. గత సంవత్సరం దాదాపు 5.16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించబడలేదు. విద్యార్థులు వారి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!