Site icon NTV Telugu

CM KCR: నేడు ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌, నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

Cm Kcr

Cm Kcr

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. నర్సపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ రూరల్, బోథ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాగా, గులాబి బాస్ ఇప్పటికే రాష్ట్రంలోని 70 నియోజక వర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు.

Read Also: Earthquake: ఉత్తరకాశీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు

ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్, బోథ్‌, నర్సాపూర్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొదటగా నర్సాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ జిల్లా కేంద్రంలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, అక్కడి నుంచి ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గ కేంద్రంలోని సభలో పాల్గొంటారు.. అయితే, ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్‌ లో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, నిన్న కేసీఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.

Exit mobile version