మందు అనుకుని ఎయిర్పాడ్స్ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech News: రాత్రి పడుకునే ముందు మందులు వేసుకోవడం చాలా మందికి రోజువారీ అలవాటు. కానీ ఒక్క చిన్న పరధ్యానం… ఒక్క క్షణం తొందర… ఎంత పెద్ద షాక్కు దారి తీస్తుందో అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మందులు అనుకుని పొరపాటున ఒక మహిళ ఎయిర్పాడ్స్ను మింగేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి నవ్వు తెప్పించే ఈ ఘటన… ఆ మహిళకు మాత్రం కొన్ని గంటల పాటు తీవ్ర ఆందోళన, భయాన్ని కలిగించింది.
అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్మార్కు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రతిరోజులాగే పడుకునే ముందు మందులు తీసుకునేందుకు సిద్ధమైన ఆమె… ఒక చేతిలో మందులు, మరో చేతిలో ఎయిర్పాడ్స్ పట్టుకుని ఉంది. అదే సమయంలో నీళ్లు తాగుతూ మందులు మింగే ప్రయత్నంలో అనుకోకుండా ఎయిర్పాడ్ను కూడా నోట్లో వేసుకుని మింగేసింది. మొదట్లో ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కానీ కొంతసేపటి తర్వాత తన ఎయిర్పాడ్స్లో ఒకటి కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది.
Also Read
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
అసలు ట్విస్ట్ అక్కడి నుంచే మొదలైంది. తన ఐఫోన్కు ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసి పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. తన స్నేహితురాలికి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు… ఆడియోలో కడుపు లోపల నుంచి వినిపిస్తున్నట్టుగా విచిత్రమైన శబ్దాలు రికార్డ్ అయ్యాయి. దీంతో నిజంగానే ఎయిర్పాడ్ తన శరీరంలోకి వెళ్లిపోయిందని ఆమె గ్రహించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కార్లీకి వైద్యులు ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అందులో ఎయిర్పాడ్ ఆమె జీర్ణాశయంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ అది ప్రమాదకర స్థితిలో లేకపోవడంతో వైద్యులు కొంత సమయం పర్యవేక్షణలో ఉంచి పరిస్థితిని గమనించారు. చివరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ ఎయిర్పాడ్ సహజంగా శరీరం నుంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అనుభవాన్ని ఆమె టిక్టాక్ వీడియోలో వివరించగా… లక్షలాది మంది నెటిజన్లు ఆశ్చర్యంతో స్పందిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు అరుదుగా జరిగినా… వైద్య నిపుణులు మాత్రం ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. మందులు వేసుకునే సమయంలో పరధ్యానం, మొబైల్ వినియోగం, తొందరపాటు వంటి కారణాల వల్ల చిన్న వస్తువులు పొరపాటున మింగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇయర్బడ్స్, బ్యాటరీలు, చిన్న గాడ్జెట్ భాగాలు శరీరంలో ఇరుక్కుపోతే ప్రాణాపాయం కూడా కలగొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే మందులు తీసుకునే సమయంలో పూర్తి జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనను చూసిన నెటిజన్లు మాత్రం, ఎయిర్పాడ్ కూడా ఇప్పుడు బ్లూటూత్తో కడుపులో పనిచేసిందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!