మందు అనుకుని ఎయిర్పాడ్స్ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech News: రాత్రి పడుకునే ముందు మందులు వేసుకోవడం చాలా మందికి రోజువారీ అలవాటు. కానీ ఒక్క చిన్న పరధ్యానం… ఒక్క క్షణం తొందర… ఎంత పెద్ద షాక్కు దారి తీస్తుందో అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మందులు అనుకుని పొరపాటున ఒక మహిళ ఎయిర్పాడ్స్ను మింగేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి నవ్వు తెప్పించే ఈ ఘటన… ఆ మహిళకు మాత్రం కొన్ని గంటల పాటు తీవ్ర ఆందోళన, భయాన్ని కలిగించింది.
అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్మార్కు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రతిరోజులాగే పడుకునే ముందు మందులు తీసుకునేందుకు సిద్ధమైన ఆమె… ఒక చేతిలో మందులు, మరో చేతిలో ఎయిర్పాడ్స్ పట్టుకుని ఉంది. అదే సమయంలో నీళ్లు తాగుతూ మందులు మింగే ప్రయత్నంలో అనుకోకుండా ఎయిర్పాడ్ను కూడా నోట్లో వేసుకుని మింగేసింది. మొదట్లో ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కానీ కొంతసేపటి తర్వాత తన ఎయిర్పాడ్స్లో ఒకటి కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది.
Also Read
- Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
- స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
- 200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
అసలు ట్విస్ట్ అక్కడి నుంచే మొదలైంది. తన ఐఫోన్కు ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసి పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. తన స్నేహితురాలికి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు… ఆడియోలో కడుపు లోపల నుంచి వినిపిస్తున్నట్టుగా విచిత్రమైన శబ్దాలు రికార్డ్ అయ్యాయి. దీంతో నిజంగానే ఎయిర్పాడ్ తన శరీరంలోకి వెళ్లిపోయిందని ఆమె గ్రహించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కార్లీకి వైద్యులు ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అందులో ఎయిర్పాడ్ ఆమె జీర్ణాశయంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ అది ప్రమాదకర స్థితిలో లేకపోవడంతో వైద్యులు కొంత సమయం పర్యవేక్షణలో ఉంచి పరిస్థితిని గమనించారు. చివరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ ఎయిర్పాడ్ సహజంగా శరీరం నుంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అనుభవాన్ని ఆమె టిక్టాక్ వీడియోలో వివరించగా… లక్షలాది మంది నెటిజన్లు ఆశ్చర్యంతో స్పందిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు అరుదుగా జరిగినా… వైద్య నిపుణులు మాత్రం ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. మందులు వేసుకునే సమయంలో పరధ్యానం, మొబైల్ వినియోగం, తొందరపాటు వంటి కారణాల వల్ల చిన్న వస్తువులు పొరపాటున మింగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇయర్బడ్స్, బ్యాటరీలు, చిన్న గాడ్జెట్ భాగాలు శరీరంలో ఇరుక్కుపోతే ప్రాణాపాయం కూడా కలగొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే మందులు తీసుకునే సమయంలో పూర్తి జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనను చూసిన నెటిజన్లు మాత్రం, ఎయిర్పాడ్ కూడా ఇప్పుడు బ్లూటూత్తో కడుపులో పనిచేసిందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
మందు అనుకుని ఎయిర్పాడ్స్ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
-
Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
-
SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
-
US-Hormuz: హార్ముజ్పై అమెరికా-ఇరాన్ గుడ్న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
-
GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!