మందు అనుకుని ఎయిర్పాడ్స్ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech News: రాత్రి పడుకునే ముందు మందులు వేసుకోవడం చాలా మందికి రోజువారీ అలవాటు. కానీ ఒక్క చిన్న పరధ్యానం… ఒక్క క్షణం తొందర… ఎంత పెద్ద షాక్కు దారి తీస్తుందో అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మందులు అనుకుని పొరపాటున ఒక మహిళ ఎయిర్పాడ్స్ను మింగేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి నవ్వు తెప్పించే ఈ ఘటన… ఆ మహిళకు మాత్రం కొన్ని గంటల పాటు తీవ్ర ఆందోళన, భయాన్ని కలిగించింది.
అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్మార్కు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రతిరోజులాగే పడుకునే ముందు మందులు తీసుకునేందుకు సిద్ధమైన ఆమె… ఒక చేతిలో మందులు, మరో చేతిలో ఎయిర్పాడ్స్ పట్టుకుని ఉంది. అదే సమయంలో నీళ్లు తాగుతూ మందులు మింగే ప్రయత్నంలో అనుకోకుండా ఎయిర్పాడ్ను కూడా నోట్లో వేసుకుని మింగేసింది. మొదట్లో ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కానీ కొంతసేపటి తర్వాత తన ఎయిర్పాడ్స్లో ఒకటి కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది.
Also Read
- Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
- Flosenso Pro: ఇక ట్యాంక్ చూడాల్సిన పనిలేదు.. మొబైల్లోనే వాటర్ ట్యాంక్ లెవల్, మోటార్ ను కంట్రోల్ చేసే గాడ్జెట్
- Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
- WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్పై ఉత్కంఠ..
అసలు ట్విస్ట్ అక్కడి నుంచే మొదలైంది. తన ఐఫోన్కు ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసి పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. తన స్నేహితురాలికి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు… ఆడియోలో కడుపు లోపల నుంచి వినిపిస్తున్నట్టుగా విచిత్రమైన శబ్దాలు రికార్డ్ అయ్యాయి. దీంతో నిజంగానే ఎయిర్పాడ్ తన శరీరంలోకి వెళ్లిపోయిందని ఆమె గ్రహించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కార్లీకి వైద్యులు ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అందులో ఎయిర్పాడ్ ఆమె జీర్ణాశయంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ అది ప్రమాదకర స్థితిలో లేకపోవడంతో వైద్యులు కొంత సమయం పర్యవేక్షణలో ఉంచి పరిస్థితిని గమనించారు. చివరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ ఎయిర్పాడ్ సహజంగా శరీరం నుంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అనుభవాన్ని ఆమె టిక్టాక్ వీడియోలో వివరించగా… లక్షలాది మంది నెటిజన్లు ఆశ్చర్యంతో స్పందిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు అరుదుగా జరిగినా… వైద్య నిపుణులు మాత్రం ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. మందులు వేసుకునే సమయంలో పరధ్యానం, మొబైల్ వినియోగం, తొందరపాటు వంటి కారణాల వల్ల చిన్న వస్తువులు పొరపాటున మింగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇయర్బడ్స్, బ్యాటరీలు, చిన్న గాడ్జెట్ భాగాలు శరీరంలో ఇరుక్కుపోతే ప్రాణాపాయం కూడా కలగొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే మందులు తీసుకునే సమయంలో పూర్తి జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనను చూసిన నెటిజన్లు మాత్రం, ఎయిర్పాడ్ కూడా ఇప్పుడు బ్లూటూత్తో కడుపులో పనిచేసిందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!