మందు అనుకుని ఎయిర్పాడ్స్ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech News: రాత్రి పడుకునే ముందు మందులు వేసుకోవడం చాలా మందికి రోజువారీ అలవాటు. కానీ ఒక్క చిన్న పరధ్యానం… ఒక్క క్షణం తొందర… ఎంత పెద్ద షాక్కు దారి తీస్తుందో అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మందులు అనుకుని పొరపాటున ఒక మహిళ ఎయిర్పాడ్స్ను మింగేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి నవ్వు తెప్పించే ఈ ఘటన… ఆ మహిళకు మాత్రం కొన్ని గంటల పాటు తీవ్ర ఆందోళన, భయాన్ని కలిగించింది.
అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్మార్కు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రతిరోజులాగే పడుకునే ముందు మందులు తీసుకునేందుకు సిద్ధమైన ఆమె… ఒక చేతిలో మందులు, మరో చేతిలో ఎయిర్పాడ్స్ పట్టుకుని ఉంది. అదే సమయంలో నీళ్లు తాగుతూ మందులు మింగే ప్రయత్నంలో అనుకోకుండా ఎయిర్పాడ్ను కూడా నోట్లో వేసుకుని మింగేసింది. మొదట్లో ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. కానీ కొంతసేపటి తర్వాత తన ఎయిర్పాడ్స్లో ఒకటి కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది.
Also Read
- Alibaba AI: మెటా, గూగుల్ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
- Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
అసలు ట్విస్ట్ అక్కడి నుంచే మొదలైంది. తన ఐఫోన్కు ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసి పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. తన స్నేహితురాలికి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు… ఆడియోలో కడుపు లోపల నుంచి వినిపిస్తున్నట్టుగా విచిత్రమైన శబ్దాలు రికార్డ్ అయ్యాయి. దీంతో నిజంగానే ఎయిర్పాడ్ తన శరీరంలోకి వెళ్లిపోయిందని ఆమె గ్రహించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కార్లీకి వైద్యులు ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. అందులో ఎయిర్పాడ్ ఆమె జీర్ణాశయంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ అది ప్రమాదకర స్థితిలో లేకపోవడంతో వైద్యులు కొంత సమయం పర్యవేక్షణలో ఉంచి పరిస్థితిని గమనించారు. చివరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ ఎయిర్పాడ్ సహజంగా శరీరం నుంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అనుభవాన్ని ఆమె టిక్టాక్ వీడియోలో వివరించగా… లక్షలాది మంది నెటిజన్లు ఆశ్చర్యంతో స్పందిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు అరుదుగా జరిగినా… వైద్య నిపుణులు మాత్రం ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. మందులు వేసుకునే సమయంలో పరధ్యానం, మొబైల్ వినియోగం, తొందరపాటు వంటి కారణాల వల్ల చిన్న వస్తువులు పొరపాటున మింగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇయర్బడ్స్, బ్యాటరీలు, చిన్న గాడ్జెట్ భాగాలు శరీరంలో ఇరుక్కుపోతే ప్రాణాపాయం కూడా కలగొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే మందులు తీసుకునే సమయంలో పూర్తి జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనను చూసిన నెటిజన్లు మాత్రం, ఎయిర్పాడ్ కూడా ఇప్పుడు బ్లూటూత్తో కడుపులో పనిచేసిందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Krishna River: కృష్ణానదిలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..
-
Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
-
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
-
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!