Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో అనుసరిస్తున్న కొన్ని టారిఫ్ పద్ధతులు పారదర్శకంగా లేవని, అవి వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)పరిగణించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే కొన్ని ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
రూ.249, రూ.199 ధర కలిగిన ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా.. రూ.209 ప్లాన్ కేవలం మై-జియో యాప్లో మాత్రమే అందుబాటులో ఉండటాన్ని ట్రాయ్ తప్పుబట్టింది. ఒకే రకమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి రావడం టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
Also Read
- HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
- Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
అంతేకాకుండా.. జియో ఫోన్, జియో భారత్ వంటి నిర్దిష్ట పరికరాలను వాడే వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక ఆఫర్లను పరిమితం చేయడం వివక్షా పూరితమని ట్రాయ్ పేర్కొంది. ఇలా ఒక నిర్దిష్టమైన ఫోన్ లేదా సాంకేతికతను కొనుగోలు చేస్తేనే తక్కువ ధర ప్లాన్లు లభిస్తాయనే నిబంధన వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందని.. దీనివల్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సదుపాయం కూడా దెబ్బతింటుందని హెచ్చరించింది.
Also Read:Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఈ పద్ధతులను సరిదిద్దుకోవడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా రూ.249, రూ.199, రూ.209 వంటి అన్ని ప్లాన్లను వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు రిటైల్ స్టోర్లలో అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే.. జియో భారత్ మరియు జియో ఫోన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ప్లాన్లను ఇతర మొబైల్ ఫోన్లు వాడే వినియోగదారులందరికీ కూడా వర్తింపజేయాలని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి సారి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్న జియో వాదనను కూడా నియంత్రణ సంస్థ తోసిపుచ్చింది. వినియోగదారులకు ప్లాన్ల ఎంపికలో పూర్తి పారదర్శకత , సమానత్వం ఉండాలని ట్రాయ్ ఈ సందర్భంగా చెప్పింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!