Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..
రిలయన్స్ జియో అనుసరిస్తున్న కొన్ని టారిఫ్ పద్ధతులు పారదర్శకంగా లేవని, అవి వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)పరిగణించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే కొన్ని ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
రూ.249, రూ.199 ధర కలిగిన ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా.. రూ.209 ప్లాన్ కేవలం మై-జియో యాప్లో మాత్రమే అందుబాటులో ఉండటాన్ని ట్రాయ్ తప్పుబట్టింది. ఒకే రకమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి రావడం టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
Also Read
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
- Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
అంతేకాకుండా.. జియో ఫోన్, జియో భారత్ వంటి నిర్దిష్ట పరికరాలను వాడే వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక ఆఫర్లను పరిమితం చేయడం వివక్షా పూరితమని ట్రాయ్ పేర్కొంది. ఇలా ఒక నిర్దిష్టమైన ఫోన్ లేదా సాంకేతికతను కొనుగోలు చేస్తేనే తక్కువ ధర ప్లాన్లు లభిస్తాయనే నిబంధన వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందని.. దీనివల్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సదుపాయం కూడా దెబ్బతింటుందని హెచ్చరించింది.
Also Read:Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఈ పద్ధతులను సరిదిద్దుకోవడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా రూ.249, రూ.199, రూ.209 వంటి అన్ని ప్లాన్లను వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు రిటైల్ స్టోర్లలో అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే.. జియో భారత్ మరియు జియో ఫోన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ప్లాన్లను ఇతర మొబైల్ ఫోన్లు వాడే వినియోగదారులందరికీ కూడా వర్తింపజేయాలని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి సారి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్న జియో వాదనను కూడా నియంత్రణ సంస్థ తోసిపుచ్చింది. వినియోగదారులకు ప్లాన్ల ఎంపికలో పూర్తి పారదర్శకత , సమానత్వం ఉండాలని ట్రాయ్ ఈ సందర్భంగా చెప్పింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!