Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో అనుసరిస్తున్న కొన్ని టారిఫ్ పద్ధతులు పారదర్శకంగా లేవని, అవి వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)పరిగణించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే కొన్ని ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
రూ.249, రూ.199 ధర కలిగిన ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా.. రూ.209 ప్లాన్ కేవలం మై-జియో యాప్లో మాత్రమే అందుబాటులో ఉండటాన్ని ట్రాయ్ తప్పుబట్టింది. ఒకే రకమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి రావడం టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
Also Read
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
అంతేకాకుండా.. జియో ఫోన్, జియో భారత్ వంటి నిర్దిష్ట పరికరాలను వాడే వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక ఆఫర్లను పరిమితం చేయడం వివక్షా పూరితమని ట్రాయ్ పేర్కొంది. ఇలా ఒక నిర్దిష్టమైన ఫోన్ లేదా సాంకేతికతను కొనుగోలు చేస్తేనే తక్కువ ధర ప్లాన్లు లభిస్తాయనే నిబంధన వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందని.. దీనివల్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సదుపాయం కూడా దెబ్బతింటుందని హెచ్చరించింది.
Also Read:Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఈ పద్ధతులను సరిదిద్దుకోవడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా రూ.249, రూ.199, రూ.209 వంటి అన్ని ప్లాన్లను వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు రిటైల్ స్టోర్లలో అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే.. జియో భారత్ మరియు జియో ఫోన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ప్లాన్లను ఇతర మొబైల్ ఫోన్లు వాడే వినియోగదారులందరికీ కూడా వర్తింపజేయాలని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి సారి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్న జియో వాదనను కూడా నియంత్రణ సంస్థ తోసిపుచ్చింది. వినియోగదారులకు ప్లాన్ల ఎంపికలో పూర్తి పారదర్శకత , సమానత్వం ఉండాలని ట్రాయ్ ఈ సందర్భంగా చెప్పింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!