RBI: ఆర్బీఐ @ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల(ఎన్బీఎఫ్సీల)ను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారీగా ఉండే డేటాబేస్ను విశ్లేషించేందుకు కూడా ఇవి అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్లను వాడనుంది.
4 రోజుల్లో రూ.730 కోట్ల మద్యం సేల్స్
Also Read
- Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
- Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా పండుగను బాగా ఎంజాయ్ చేశారు. దీంతో 4 రోజుల్లోనే 730 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఖుషీ అవుతోంది. అయితే.. ఈ సేల్స్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి జరిగినవి మాత్రమేనని, ఇక.. మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల రిటైల్ విక్రయాలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ అమ్మకాలు రెట్టింపు సంఖ్యలో జరిగినట్లు తేలుతుందని అంటున్నారు. తెలంగాణ బేవరేజెస్ మద్యం డిపోలు రాష్ట్రవ్యాప్తంగా 19 ఉన్నాయి. వీటి ద్వారా 2 వేల 620 షాపులు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులకు మద్యం సప్లై అవుతుంది.
తెలంగాణలో ప్రతి సంవత్సరం దసరా సమయంలో మద్యం విక్రయాలు పెరుగుతుంటాయి. సాధారణంగా నిత్యం 80 నుంచి 90 కోట్ల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతాయి. కానీ.. ఈ నెల 1వ తేదీన మినహాయిస్తే మిగతా 3 రోజులూ రోజుకి రూ.100 కోట్లకు పైగానే సేల్స్ సాగాయి. ఆగస్టు 30వ తేదీన ఏకంగా 300 కోట్లకు పైగా విక్రయాలు చోటుచేసుకునట్లు తెలుస్తోంది.
read also: Rupee Hits Fresh Record Low: ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి.. 82 మార్క్ కూడా దాటేసింది..
యాక్టిస్తో మహింద్రా లైఫ్స్పేస్ జట్టు
మహింద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ యాక్టిస్తో జట్టు కట్టింది. దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీల అభివృద్ధి కోసం జాయింట్ వెంచర్ ద్వారా ప్రాథమికంగా 2 వేల 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ విషయాన్ని మహింద్రా లైఫ్స్పేస్ కంపెనీ.. రెగ్యులేటరీకి తెలియజేసింది. జాయింట్ వెంచెర్లో 26 శాతం నుంచి 40 శాతం వరకు వాటాను మహింద్రా లైఫ్స్పేస్ తీసుకుంటుంది. మిగిలిన షేరును యాక్టిస్ సొంతం చేసుకుంటుంది.
తాజావార్తలు
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!