Fact Check: “3 నెలల ఫ్రీ రీఛార్జ్.. డిసెంబర్ 30 వరకే ఛాన్స్”.. ఈ మెసేజ్ నిజమేనా ?
- సోషల్ మీడియా వైరల్ అవుతున్న మెసేజ్
- పీఎం 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ పథకం
- పోస్ట్లో పేర్కొన్న లింక్
- ఈ మెసేజ్లో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫిషింగ్ లింక్లు కూడా వైరల్ అవుతాయి. ఈ లింక్లను క్లిక్ చేయడం వలన వినియోగదారులకు సమస్యలు పెరుగుతాయి. అలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతీయ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 30లోపు ఈ రీఛార్జ్ని పొందండని రాసుకొచ్చారు. పోస్ట్తో పాటు లింక్ కూడా షేర్ చేశారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్ను పొందవచ్చు అని తెలిపారు.
నవంబర్ 27న వైరల్ పోస్ట్..
నవంబర్ 27, 2024న ఫేస్బుక్ (Facebook) వినియోగదారు రుషికేష్ కాలే ఈ వైరల్ పోస్ట్ను షేర్ చేశాడు. క్యాప్షన్లో “ప్రధాన మంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతదేశంలోని వినియోగదారులందరూ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ పొందడం ప్రారంభించారు. నేను కూడా 84 రోజుల ఉచిత రీఛార్జ్ ను పొందాను. మీరు కూడా క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్ పొందవచ్చు. ఈ పథకం 30 డిసెంబర్ 2024 వరకు మాత్రమే ఉంటుంది.” అని పేర్కొన్నాడు.
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
విచారణ…
లింక్ ను పరీక్షించేందుకు మేము వైరల్ పోస్ట్లో ఉన్న లింక్ యొక్క URLని చెక్ చేశాం. పోస్ట్లో ఇచ్చిన లింక్ URL techtadaka.com అని కనుగొన్నాం. ఇది ఏ అధికారిక వెబ్సైట్కి సంబంధించి లింక్ కాదని స్పష్టమైంది. అనంతరం మేము ఇలాంటి పథకం ఏమైనా కేంద్రం ప్రవేశ పెట్టిందా? అని చెక్ చేశాం. అలాంటి పథకం లేదని తెలుసుకున్నాం. అంతే కాకుండా వైరల్ అవుతున్న మెసేజ్లో జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, తదితర టెలికాం కంపెనీల పేర్లు ప్రస్తావించారు. ఆయా టెలికాం కంపెనీల అధికారిక సైట్లు చెక్ చేశాం. అందులో కూడా ఇలాంటి స్కిం వివరాలు కనిపించలేదు.
నిపుణుల సమాచారం..
అయితే.. ఈ మెజేస్పై నిపుణులను సంప్రదించాం. వారు మాట్లాడుతూ.. “ఇలాంటి లింక్లను వినియోగదారులను మోసం చేయడానికి వాడుతుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటి లింక్లపై క్లిక్ చేసే ముందు.. మీరు URLని జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఈ మెసేజ్ పూర్తిగా నకిలీది. వినియోగదారులు జాగ్రత్తలు వహించాలి.” అని టెలికాం నిపుణులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!