Sundar Pichai: డోంట్ వర్నీ.. కొత్త ఏఐపై గూగుల్ సీఈఓ క్లారిటీ..
Sundar Picha: టెక్ ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. ఒక్క ఏఐ టూల్లో టెక్కీలు భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా ఒక్కసారిగా భయం చుట్టుముట్టింది. ఆంత్రోపిక్ అనే ఏఐ కంపెనీ విడుదల చేసిన కొత్త ప్లగిన్లతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వీటితో సాఫ్ట్వేర్ కంపెనీల రోజులకు రోజులు దగ్గర పడ్డాయనే వాదనలు జోరుగా వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒకే రోజులో దాదాపు 285 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. దీనికి కొంతమంది ‘సాస్పోకలిప్స్’ అనే పేరు కూడా పెట్టేశారు. ఈ అంశంపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఏఐ అనేది ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం కాదని.. ఇది మనం చేసే పనికి సహాయం చేసే ఒక సాధనం మాత్రమే అని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ఏఐ వల్లే మరింత మెరుగయ్యాయని తెలిపారు. కంపెనీలకు ఇదే మంచి సమయమని వెల్లడించారు. మార్కెట్లో వచ్చిన ఈ గందరగోళం అంతా అతిశయోక్తే అని అభిప్రాయపడ్డారు.
READ MORE: Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
ఈ మాటలకు ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ సైతం మద్దతిచ్చారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ షేర్ల పతనం తనకు అయితే ప్రపంచంలోనే అతి అవివేకమైన విషయం అనిపిస్తోందని వ్యాగ్యంగా అన్నారు. “ఒక స్క్రూ తిప్పడానికి కొత్త సాధనం తయారు చేస్తామా? లేక ఉన్న స్క్రూడ్రైవర్నే వాడతామా? ఏఐ కూడా అంతే. ఇది ఉన్న సాఫ్ట్వేర్ను వాడుతుంది. కానీ వాటిని పూర్తిగా తీసేయదు” అని తెలిపారు. ఎన్విడియాలోనూ ఇలాంటి ఏఐ టూల్స్ని వాడటం వల్ల ఉద్యోగులు చిన్న పనుల నుంచి విముక్తి పొందారని, అసలు ముఖ్యమైన చిప్స్ డిజైన్ చేసే పనిపై దృష్టి పెట్టగలుగుతున్నారని చెప్పారు. అయితే ఈ భయానికి అసలు కారణం ఆంత్రోపిక్ ‘క్లాడ్ కోవర్క్’ అనే ఏఐకి చెందిన 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లు. ఇవి సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ లాంటి సాధారణ కార్యాలయ పనులు చేస్తాయి. కానీ అసలు గుబులు తెచ్చింది లీగల్ ప్లగిన్. ఇది ఒప్పందాలు చెక్ చేయడం, ఎన్డీఏలు చూసుకోవడం, నిబంధనల పరిశీలన, లీగల్ రిపోర్టులు తయారు చేయడం లాంటి పనులన్నీ ఆటోమేటిక్గా చేస్తుంది. దీంతో పెద్ద లీగల్ కంపెనీల భవిష్యత్తు మీద అనుమానాలు మొదలయ్యాయి. దీని ఎఫెక్ట్తో థామ్సన్ రాయిటర్స్, రిలెక్స్ లాంటి సంస్థల షేర్లు దాదాపు 15 శాతం పడిపోయాయి. లీగల్జూమ్ అయితే 20 శాతం కుప్పకూలింది. భారత్లోనూ ప్రభావం కనిపించింది. ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ కంపెనీల షేర్లు తగ్గాయి.
READ MORE: మాగ్నెటిక్ వైర్లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!