Chinese companies from India: భారత్ నుంచి చైనా కంపెనీలు ఔట్.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese companies from India: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్ను వీడనున్నాయా? ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా? అంటే మాత్రం అవుననే చెబుతుంది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్.. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు షియోమీ, వివో, ఒప్పో వంటి సంస్థలు, భారత్ను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని డ్రాగన్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఇక దేశీయ మొబైల్ కంపెనీల మార్కెట్ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నదని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. దీంతో.. ఈజిప్ట్లో 20 మిలియన్ల డాలర్ల విలువ గల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకున్నది. అంతేకాకుండా.. ఈజిప్ట్తోపాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నాయి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు.
అయితే.. ఒప్పో, వివో ఇండియా, షియోమీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక పన్ను ఎగవేత పాల్పడ్డాయంటూ ఈ మూడు సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే.. టెన్సెంట్స్ వారి వీచాట్, బైట్ డ్యాన్స్ వారి టిక్టాక్ సహా 300కి పైగా చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. ఇక మరోవైపు.. స్మార్ట్ ఫోన్ల తయారీలో స్వావలంభన సాధించడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే.. స్మార్ట్ ఫోన్లలో కీలకమైన చిప్ మాన్యుఫాక్చరింగ్ కూడా దేశంలోకి తేవడానికి కసరత్తు జరిగింది. దీనికోసం వేదాంతా.. ఫాక్స్కాన్ సంస్థలతో రూ.1.54 లక్షల కోట్ల విలువ గల సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గుజరాత్ సర్కార్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతీ టెక్ దిగ్గజం ఆపిల్ వారి ఐఫోన్లను భారత్లో తయారు చేయడానికి తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న విస్ట్రన్ సంస్థతో టాటా సన్స్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Corona Cases: దేశంలో 47 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
Also Read
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
- Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
- Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?