Chinese companies from India: భారత్ నుంచి చైనా కంపెనీలు ఔట్.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese companies from India: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్ను వీడనున్నాయా? ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా? అంటే మాత్రం అవుననే చెబుతుంది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్.. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు షియోమీ, వివో, ఒప్పో వంటి సంస్థలు, భారత్ను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని డ్రాగన్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఇక దేశీయ మొబైల్ కంపెనీల మార్కెట్ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నదని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. దీంతో.. ఈజిప్ట్లో 20 మిలియన్ల డాలర్ల విలువ గల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకున్నది. అంతేకాకుండా.. ఈజిప్ట్తోపాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నాయి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు.
అయితే.. ఒప్పో, వివో ఇండియా, షియోమీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక పన్ను ఎగవేత పాల్పడ్డాయంటూ ఈ మూడు సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే.. టెన్సెంట్స్ వారి వీచాట్, బైట్ డ్యాన్స్ వారి టిక్టాక్ సహా 300కి పైగా చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. ఇక మరోవైపు.. స్మార్ట్ ఫోన్ల తయారీలో స్వావలంభన సాధించడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే.. స్మార్ట్ ఫోన్లలో కీలకమైన చిప్ మాన్యుఫాక్చరింగ్ కూడా దేశంలోకి తేవడానికి కసరత్తు జరిగింది. దీనికోసం వేదాంతా.. ఫాక్స్కాన్ సంస్థలతో రూ.1.54 లక్షల కోట్ల విలువ గల సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గుజరాత్ సర్కార్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతీ టెక్ దిగ్గజం ఆపిల్ వారి ఐఫోన్లను భారత్లో తయారు చేయడానికి తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న విస్ట్రన్ సంస్థతో టాటా సన్స్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Corona Cases: దేశంలో 47 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
Also Read
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!