Chinese companies from India: భారత్ నుంచి చైనా కంపెనీలు ఔట్.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese companies from India: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్ను వీడనున్నాయా? ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా? అంటే మాత్రం అవుననే చెబుతుంది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్.. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు షియోమీ, వివో, ఒప్పో వంటి సంస్థలు, భారత్ను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని డ్రాగన్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఇక దేశీయ మొబైల్ కంపెనీల మార్కెట్ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నదని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. దీంతో.. ఈజిప్ట్లో 20 మిలియన్ల డాలర్ల విలువ గల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకున్నది. అంతేకాకుండా.. ఈజిప్ట్తోపాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నాయి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు.
అయితే.. ఒప్పో, వివో ఇండియా, షియోమీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక పన్ను ఎగవేత పాల్పడ్డాయంటూ ఈ మూడు సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే.. టెన్సెంట్స్ వారి వీచాట్, బైట్ డ్యాన్స్ వారి టిక్టాక్ సహా 300కి పైగా చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. ఇక మరోవైపు.. స్మార్ట్ ఫోన్ల తయారీలో స్వావలంభన సాధించడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే.. స్మార్ట్ ఫోన్లలో కీలకమైన చిప్ మాన్యుఫాక్చరింగ్ కూడా దేశంలోకి తేవడానికి కసరత్తు జరిగింది. దీనికోసం వేదాంతా.. ఫాక్స్కాన్ సంస్థలతో రూ.1.54 లక్షల కోట్ల విలువ గల సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గుజరాత్ సర్కార్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతీ టెక్ దిగ్గజం ఆపిల్ వారి ఐఫోన్లను భారత్లో తయారు చేయడానికి తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న విస్ట్రన్ సంస్థతో టాటా సన్స్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Corona Cases: దేశంలో 47 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
- Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
తాజావార్తలు
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!