భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. శీతాకాల విడిది కోసం విచ్చేసిన రాష్ట్రపతికి హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్లు ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వ విద్యా శాఖ బుధవారం తెలిపింది. సాధారణంగా, ప్రాథమిక పాఠశాల పిల్లలకు శీతాకాల సెలవులు డిసెంబర్ 25 నుండి జనవరి 15 వరకు, ప్రాథమిక తరగతులకు శీతాకాల సెలవులు జనవరి 1 నుండి 15 వరకు ఉంటాయి. ఈసారి శీతాకాల సెలవులను 10 నుంచి 15 రోజులు తగ్గించారు.