Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 175 మంది మరణించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ ఘోరానికి కారణం ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులేనని ఇరాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేస్తూ వారి వివరాలను ప్రపంచానికి వెల్లడించింది. భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఆదివారం నాడు ఈ ఇద్దరు అధికారుల పేర్లను, ఫోటోలను…
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దీని కోసం బ్లూ స్పారో అనే ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని జెట్ లాంచ్డ్ బలిస్టిక్ క్షిపణిగా పిలుస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగి.. యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం ఇరాన్ వరుస దాడులతో పక్కనే ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై విరుచుకుపడుతోంది.…