Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 175 మంది మరణించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ ఘోరానికి కారణం ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులేనని ఇరాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేస్తూ వారి వివరాలను ప్రపంచానికి వెల్లడించింది. భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఆదివారం నాడు ఈ ఇద్దరు అధికారుల పేర్లను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాయి.
READ ALSO: CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం
Also Read
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
అమెరికా యుద్ధనౌక ‘యూఎస్ఎస్ స్ప్రూన్స్’ (USS Spruance)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్.టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ. యార్క్.. మినాబ్ పాఠశాలపై మూడు టోమాహాక్ క్షిపణులను ప్రయోగించాలని వీరిద్దరే ఆదేశించారని, దీనివల్ల 168 మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. “ఈ ఇద్దరు మృగాలను గుర్తుంచుకోండి” అంటూ భారత ఇరాన్ రాయబార కార్యాలయం ‘X’లో తీవ్రస్థాయిలో మండిపడింది. జెనీవాలో జరిగిన అత్యవసర భేటీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి మాట్లాడుతూ.. ఇది పొరపాటున జరిగిన దాడి కాదని, ముందస్తు ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేసిన ‘యుద్ధ నేరం’ అని అభివర్ణించారు. ఇరాన్పై దాడి మొదలైన మొదటి రోజే విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా బాంబులు వేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు, ఈ దాడిపై అమెరికా భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఇది నిఘా లోపం వల్ల జరిగిన పొరపాటుగా అమెరికా సైనిక దర్యాప్తులో తేలింది. లక్ష్యాన్ని గుర్తించడానికి పాతబడిన మ్యాపులను ఉపయోగించడం వల్ల, క్షిపణి అసలు లక్ష్యమైన సైనిక స్థావరానికి బదులుగా సమీపంలోని పాఠశాలపై పడిందని అమెరికా పేర్కొంది. తాము పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ ఆయుధ వ్యవస్థలకే కచ్చితత్వం లేదని, ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం కూడా ఉండి ఉండవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ క్షిపణి దాడి తర్వాత పశ్చిమ ఆసియాలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ – గల్ఫ్ దేశాల్లోని పలు లక్ష్యాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాన్ రాయబార కార్యాలయం షేర్ చేసిన దాడి వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
తాజావార్తలు
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
-
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
-
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
-
High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
ట్రెండింగ్
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!