Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 175 మంది మరణించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ ఘోరానికి కారణం ఇద్దరు అమెరికా నావికాదళ అధికారులేనని ఇరాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేస్తూ వారి వివరాలను ప్రపంచానికి వెల్లడించింది. భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఆదివారం నాడు ఈ ఇద్దరు అధికారుల పేర్లను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాయి.
READ ALSO: CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
అమెరికా యుద్ధనౌక ‘యూఎస్ఎస్ స్ప్రూన్స్’ (USS Spruance)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్.టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ. యార్క్.. మినాబ్ పాఠశాలపై మూడు టోమాహాక్ క్షిపణులను ప్రయోగించాలని వీరిద్దరే ఆదేశించారని, దీనివల్ల 168 మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. “ఈ ఇద్దరు మృగాలను గుర్తుంచుకోండి” అంటూ భారత ఇరాన్ రాయబార కార్యాలయం ‘X’లో తీవ్రస్థాయిలో మండిపడింది. జెనీవాలో జరిగిన అత్యవసర భేటీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి మాట్లాడుతూ.. ఇది పొరపాటున జరిగిన దాడి కాదని, ముందస్తు ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేసిన ‘యుద్ధ నేరం’ అని అభివర్ణించారు. ఇరాన్పై దాడి మొదలైన మొదటి రోజే విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా బాంబులు వేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు, ఈ దాడిపై అమెరికా భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఇది నిఘా లోపం వల్ల జరిగిన పొరపాటుగా అమెరికా సైనిక దర్యాప్తులో తేలింది. లక్ష్యాన్ని గుర్తించడానికి పాతబడిన మ్యాపులను ఉపయోగించడం వల్ల, క్షిపణి అసలు లక్ష్యమైన సైనిక స్థావరానికి బదులుగా సమీపంలోని పాఠశాలపై పడిందని అమెరికా పేర్కొంది. తాము పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ ఆయుధ వ్యవస్థలకే కచ్చితత్వం లేదని, ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం కూడా ఉండి ఉండవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ క్షిపణి దాడి తర్వాత పశ్చిమ ఆసియాలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ – గల్ఫ్ దేశాల్లోని పలు లక్ష్యాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాన్ రాయబార కార్యాలయం షేర్ చేసిన దాడి వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..