గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విప్ , స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో కొత్త గ్రంథాలయ భవనంలో కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గీత కార్మికులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గీత కార్మికులకు అవసరమైన సహాయం…
మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.