VishnuKumar Raju: భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ సంకేతాలు పంపింది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలబోమని మరోసారి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయనున్నట్లు సమాచారం. జనసేన పొత్తులో ఉంటే మంచిది.. లేకున్నా మంచిది అనే సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంటరి పోరుకు సిద్ధ పడాలని రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ డైరెక్షన్ ఇవ్వనుంది.…
ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోంది.. ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరు.. బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అంగీకరించబోదని స్పష్టం చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఋషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత… ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభం కావొచ్చు అని అంచనా వేశారు. ఇక, రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో లేవు., మార్కెట్లలోను కనిపించడం లేదు… పెద్ద నోట్లను…
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు……