హైదరాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది. సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు.…
యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్లో సముద్రుడి సాక్షిగా... భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో... వీళ్ళెవరో మహానుభావులు..... అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది.
విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన గురువు సత్యానంద్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక తాను నటన నేర్చుకోవడానికి విశాఖ వచ్చినప్పటి విషయాలను సైతం గుర్తు చేసుకున్నారు అయితే అందులో భాగంగా ఉత్తరాంధ్ర జానపదం అయిన బైబయ్యే బంగారు రమణమ్మ అనే పాటను ఆయన పాడి వినిపించడం ఈవెంట్ కి హాజరైన అందరికీ ఒక స్వీట్ మెమరీలా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో…
హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు మేనియా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అన్న మంగళగిరిలో మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి విశాఖపట్నంలో ఒక ఈవెంట్లో హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదిలా…
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి…
HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ చాలా ఏళ్ల తర్వాత వస్తుండటంతో దీని గురించే చర్చ జరుగుతోంది. జులై 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. దాని డేట్ మారొచ్చనే వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. అయితే ఈవెంట్ కు డైరెక్టర్ క్రిష్ వస్తాడా రాడా అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి మొదటి డైరెక్టర్…
Ram Mohan Naidu: గత నెలలో జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆఫ్ కావడంతో, ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.
Narendra Modi : విశాఖపట్నం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సముద్రతీరాన లక్షలాది మంది ప్రజలు చేరి యోగాసనాలు చేస్తూ ఈ వేడుకను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. 175 దేశాలు…
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశారు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. Also Read:Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్…