ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.
విశాఖపట్నం వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో స్థానంలోకి వచ్చాం... రియల్ టైమ్ గవర్నెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒకప్పుడు జాబ్ వర్క్ కి పరిమితం అయ్యే ఐటీ కంపెనీలు, ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి.. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించిన వారిలో ఉండడం మనకు…
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ విశాఖపట్నంలో తన నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. రామ్నగర్లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు.
సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం చాలా వరకు సేఫ్ కాదని పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ పెట్టిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మన ప్రొఫైళ్స్ ఇతరుల ఆదీనంలోకి వెళ్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు…
విశాఖపట్నంలో గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్ గజపతి రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాను.విశాఖ లో ప్రజా ధనం తో కట్టిన ఋషి కొండ ప్యాలస్ పెచ్చులు ఉడిపోయాయి అని తెలిసింది.ఆ భవనం కోసం ఖర్చు పెట్టిన 600- 700 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయ్యేది అనుకునే వాడిని….ఈ ప్యాలస్ ఏం చెయ్యాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది…దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే…
డ్రగ్స్ వినియోగంలో ఏపీలోని మెగాసిటీ విశాఖ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా MDMA డ్రగ్స్ తెప్పించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో జనసేన పార్టీని విస్తరించండని అంటున్నారని.. తాను విస్తరించాలి అంటే ముందు మీరు పోరాటం చేయండి అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మీకు అండగా సైద్ధాంతిక బలం తాను ఇస్తాను అని, మీరు బలోపేతం చేస్తే ఖచ్చితంగా ఒకరోజున జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఒకరోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కానీ ఖచ్చితంగా ప్రజలు అందరూ కలిసి…