Vizag: ఇన్స్టాగ్రామ్లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…
- సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం..
- సేఫ్ కాదంటున్న పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం చాలా వరకు సేఫ్ కాదని పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ పెట్టిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మన ప్రొఫైళ్స్ ఇతరుల ఆదీనంలోకి వెళ్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు మంచిది కాదంటూ పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నా.. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.. ముఖ్యంగా మహిళలు, యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విశాఖకు చెందిన ఓ మహిళ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ స్టేటస్ పెట్టుకుంది. అప్పుడప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండేది. అయితే ఓ రోజు.. ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.. ఎందుకంటే అందులో ఉన్నది తన ఫోటో.. అది కూడా చూడని విధంగా అశ్లీలంగా ఉంది..
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
దీంతో షాక్లోకి వెళ్లిపోయిన ఆ మహిళకు.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది.. చెప్పినట్టు వినకపోతే ఇలాంటి ఫోటోలు అందరికీ షేర్ చేస్తానని బెదిరింపు మెసేలు వచ్చాయి. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి ఓ యువకుడు.. యువతి ఫోటోను అశ్లీలంగా మార్ఫ్ చేసినట్టు గుర్తించారు. బాధితురాలు ఇంస్టాగ్రామ్ కి అశ్లీల ఫోటోలను పంపిన యువకుడిని నంద్యాల జిల్లాకు చెందిన గురునాథ్ గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!