ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని అప్పటి ప్రభుత్వం, సినిమా పెద్దలు భావించారు. అందుకు విశాఖ పట్టణాన్ని కేంద్రంగానూ ఎంచుకున్నారు. అప్పటికే అక్కడ డి.రామానాయుడు ఫిలిమ్ స్టూడియోస్ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఓ ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్ అవసరమని భావించారు. విశాఖ ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అక్కడి ఔత్సాహికులను ప్రోత్సహించడానికి స్థాపించడం జరిగింది. ఆ క్లబ్ కు అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నియమితులయ్యారు.…