వన్డే సిరీస్లో భాగంగా శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. రాంచీ, రాయ్పుర్లో రెండు మ్యాచ్లు ముగియగా.. సిరీస్ 1-1తో సమంగా ఉంది. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మూడో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి.. సిరీస్ విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. అయితే వైజాగ్లో భారత్కు ఉన్న ఏకైక ప్రయోజనం…