సోషల్ మీడియా యుగంలో ఏ విషయాన్నైనా నెటిజన్లు ఇట్టే తవ్వి తీస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు విద్యాబాలన్, కియారా అద్వానీలు గతంలో మతం, ఆహారపు అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విద్యాబాలన్ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం ప్రస్తుతం మతపరంగా విడిపోయిందని, పూర్వం దేశానికి ఇంతటి మతపరమైన గుర్తింపు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తాను ఆధ్యాత్మిక వ్యక్తినైనప్పటికీ గుడులు, మసీదులు వంటి మతపరమైన కట్టడాలకు విరాళాలు ఇవ్వనని, కేవలం…