నోయిడాలోని జేపీ ఆస్పత్రిలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మగ, మహిళా సెక్యూరిటీ గార్డులపై ఇష్టానురీతిగా దాడులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. ఇంకొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.