2016లో వచ్చిన ఇంకొక్కడుతో విక్రమ్ , ఆనంద్ శంకర్ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకుంది. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా విక్రమ్ను డ్యూయల్ రోల్లో కొత్తగా ప్రెజెంట్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఆనంద్ శంకర్, విక్రమ్ జోడీ కలవడం ఫ్యాన్స్లో హైప్ పెంచుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వీళ్ల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారు. Also Read…