తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. కంపార్టుమెంట్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, పాలు, తాగునీటి సరఫరా చేస్తున్నట్లు వివరించింది. శ్రీవారిని బుధవారం నాడు 66,745 మంది భక్తులు దర్శించుకున్నారని.. 30,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది. హుండీ ద్వారా స్వామివారికి రూ.5.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది. మరోవైపు…