జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో నిర్మిస్తున్న కాళేశ్వరం లింక్2 పంపు హౌస్ లో భూములు కోల్పోతున్న భూ నిర్వహసితుల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొ.కోదండరాం. మనమందరం న్యాయ పరంగా మన భూముల విషయంలో పోరాడాలన్నారు కోదండరాం. భూమికి బదులు భూమి అయిన లేదా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. మనం భయపడేది లేదని భయపడితే ఆనాడు తెలంగాణ రాకపోయేదని, స్వాతంత్రం కూడా రాకపోయేదన్నారు కోదండరాం. మీరు ధైర్యంగా…