కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రపంచంలో అనేక రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి తయారినీ బట్టి కరోనా వైరస్ ను అడ్డుకునే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లు మూడు నెలల పాటు కరోనా మహమ్మారికి అడ్డుకోగలిగితే మరికొన్ని ఆరు నెలల వరకు వైరస్ను అడ్డుకోగలుగుతాయి. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల వరకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, బలమైన…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం కావడంతో దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈ మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. రాబోయే 15 రోజుల…
అమెరికాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత లేనప్పటికీ మతపరమైన కారణాలు, ఇతర సొంత కారణాల వలన వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివక్ష మొదలైంది. ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని ట్యాక్సీ సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాతో మరణించే అవకాశాలు 11రెట్లు తక్కువగా ఉంటుందని, టీకాలు తీసుకోని వారితో పోల్చితే తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా 10రెట్లు తక్కువగా…
కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్లో…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ కోటి మంది వరకు టీకాలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలను ఒపెన్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్ధి, ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ టీకాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానోపాద్యాయులు, పీహెచ్సీలు సమన్వయంతో టీకాలు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 10 వ తేదీలోగా విద్యాసంస్థల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలని ఆదేశించింది.…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఆయన ఇచ్చే ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది.. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని దేశాలను కలవరానికి గురిచేస్తుండగా… కోవిడ్ కట్టడానికి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ తరుణంలో కిమ్ షాకింగ్ ప్రకటన చేశారు.. కోవిడ్ వ్యాక్సిన్ తమకు అవసరం లేదని ప్రకటించారు.. దీనికి బదులుగా తమదైన శైలిలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలంటూ అధికారులకు…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే,…
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గత రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వరకు వ్యాక్సినేషన్లను అందిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 66…
దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అన్ని రకాల కరోనా వైరస్లను తట్టుకునే విధంగా ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఒక్కటి కావాలని, అన్ని రకాల వైరస్లను తట్టుకునే విధంగా వ్యాక్సిన్లను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచ దేశాలు సహకరించాలని, అభివృద్ది…