Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు.