Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బ్రస్ట్ నేపథ్యంలో భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావంతో రిషికేశ్లోని పరమార్థ నికేతన్ ఆశ్రమం వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహించి, అక్కడి హారతి స్థలంలో ఉన్న శివుడి విగ్రహం పాదాలను తాకింది. ప్రస్తుతం అన్ని ఘాట్లు మూసివేయగా, నదీ తీరం వద్ద ప్రజల ప్రవేశాన్ని అధికారులు అనుమతించడం లేదు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర అత్యవసర కేంద్రంలో సమీక్ష…
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.