Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం గ్యాప్-2 ఆనకట్ట నిర్మాణంలో తీవ్ర సాంకేతిక వ్యత్యాసాలను తన లేఖలో ప్రస్తావించారు. పూర్తిస్థాయి డిజైన్ ఆమోదాలు లేకుండానే పనులు కొనసాగించడం ప్రమాదకరం అని ఉండవల్లి హెచ్చరించారు. ఆనకట్ట పునాది స్థాయిలో వ్యత్యాసం ఉండటం వల్ల స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందనీ... పునాది…