భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) విమాన ప్రయాణికులకు ఒక గొప్ప ఊరటనిచ్చే వార్తను అందించింది. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.. ఇది మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద భారంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్’ (UDAN Yatri Cafe) అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవలను దేశవ్యాప్తంగా 24 ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే జాతీయ విమానయాన…