భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో లియాండర్ పేస్ చేరాడు. దీంతో గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా సమక్షంలో లియాండర్ పేస్ టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నాడు. కోల్కతాకే చెందిన లియాండర్ పేస్ తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్లో అనేక సంచలనాలు సృష్టించాడు. Read…
కేంద్రంలోని బీజేపీకి కొరకరాని కొయ్యగా పశ్చిమబెంగాల్ మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి సర్వశక్తులను ఒడ్డింది. మరోవైపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సైతం తన పట్టును కాపాడుకునేందుకు శతవిధలా ప్రయత్నించింది. హోరాహోరీ ఫైట్లో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బెనర్జీ మాత్రం ఓటమి పాలవడం బీజేపీకి కొంత ఊరటను ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు…