పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఓ క్రైస్తవుడిని కొట్టి చంపారు. దైవదూషణ ఆరోపణలపై గత వారం హింసాత్మక గుంపు క్రైస్తవ వృద్ధుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆయన మరణించినట్లు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రాడికల్ ఇస్లామిస్ట్ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు సర్గోధా జిల్లాలోని ముజాహిద్ కాలనీలో ఉండే.. క్రైస్తవ సంఘ సభ్యులపై దాడి చేశారు. ఇద్దరు క్రైస్తవులను, 10 మంది పోలీసులపై దాడి చేశారు. కాగా.. ఈ దాడిలో వారికి తీవ్ర…