అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో, నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. రేపటి నుండి తిరుపతి నగరవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వ , ప్రైవేటు గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయించుకున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు శ్రీవారి…