Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ ది కేరళ స్టోరీ 2’’ వివాదంగా మారింది. కేరళ రాష్ట్రాన్ని అవమానించేలా సినిమా ఉందనే విమర్శలు రావడంతో కేరళ హైకోర్టు రేపు సినిమా చూస్తామని ప్రకటించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ కేసుపై మాట్లాడుతూ..
సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్లో ఒక ముస్లిం కుటుంబం ఒక అమ్మాయికి బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించినట్లు చూపించిన దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. Also Read : Rashmika :…
The Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో అధికార కమ్యూనిస్ట్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ కూడా మండిపడుతున్నాడు. కేరళలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి సినిమాలు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.