TET Exam 2023: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్ష 2023లో పొరపాటు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా జరిగినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభ్యర్థులకు మండిపడ్డారు.
జీవితమే ఒక పరీక్ష. అందులో మనం పరీక్ష రాస్తూనే వుంటాం. ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరవుతూనే వుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఒక్క నిముషం ఆలస్యం అయినా చాలామందికి పరీక్ష రాసే అవకాశం లభించలేదు. పరీక్ష కేంద్రం వద్ద చంటి పిల్లలతో ఎగ్జామ్ రాయటానికి వచ్చిన తల్లులు ఉయ్యాలలు ఏర్పాటు చేసుకున్నారు. తల్లులతో పాటు వారి భర్తలు, కుటుంబ సభ్యులు తోడుగా వచ్చారు. చంటి పిల్లల్ని తమ బంధువులకు అప్పగించిన తల్లి…