మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుండి రెండవ పాట విడుదలైంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘బెల్లా బెల్లా’ చార్ట్బస్టర్గా నిలిచింది. తాజాగా, మేకర్స్ రెండవ పాట ‘అద్దం…