తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయక తప్పదు అంటున్నాయి ఉన్నత విద్యా మండలి వర్గాలు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక 15 రోజుల గడువు ఇచ్చి ఎంసెట్ నిర్వహిస్తాము అని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ జరగాలి. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాకే డిగ్రీ తో ముడి పడి ఉన్న కామన్ ఎంట్రెన్స్ లు నిర్వహిస్తారు.…
ధాన్యం కొనుగోళ్లల్లో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది యాసంగి రికార్డును దాటాయి ధాన్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా… ఈఏడాది 10 లక్షల మంది రైతుల నుండి 12,247 కోట్ల విలువచేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. కానీ గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు…
కరోనా వ్యాక్సిన్ల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై కూడా లేదన్నారు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్రానికి ముందు చూపు…
ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణ వైద్య శాఖ సీరియస్ అయింది. ఎన్టీవీలో వరుస కథనాలతో ఆస్పత్రులపై యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 64 ఆస్పత్రులపై 88 నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు, వైద్యశాఖ అనుసంధానంగా ఉండి.. ఎక్కువ బిల్స్ వేస్తే తగ్గిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 4 కోట్లు…
లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో…
తెలంగాణలో ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతుండగా మరోవైపు రైతులు ఆంధోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని తుఫ్రాన్ మండలంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆంధోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు నిరసనలు చేస్తున్నారు. పంటను రోడ్లపై పోసి తగలబెట్టారు. దీంతో గజ్వేల్-తుఫ్రాన్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాక్ సడలింపుల సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే ఆంధోళనలు ఉదృతం చేస్తామని…
తెలంగాణలో కరోనా కారణంగా అన్నిరకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. పదోతరగతి పరీక్షలను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వాహణ విషయంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ తన అభిప్రాయం తెలిపింది. జులై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. గతంలోనే ప్రశ్నాపత్రాల ముద్రణ పూర్తయ్యాయని, మార్చడం కుదరదని తెలిపింది. పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరు కుదిస్తామని, రాయాల్సిన ప్రశ్నలను…
కోట్లాది తెలుగు వారి ఆరాధ్య దైవం , యావత్ ప్రపంచంలోనే మన తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక ఐకాన్ సీనియర్ ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేశారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని..తెలుగు ప్రజలకు…
వృద్ద కళాకారులకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల వారీ పెన్షన్ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతూ జీవో జారీ చేసింది. జూన్- 2021 నుంచి దీన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. వృద్ధ కళాకారులకు పింఛన్ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో…