Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Banswada Mother Murder: కన్న తల్లి ఆ కొడుక్కి… భారం అయ్యింది. వృద్దాప్యంలో ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన ఆ కసాయి కొడుకు .. నవమాసాలు మోసిన కన్న తల్లిని కడతేర్చాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో దారుణ ఘటన జరిగింది. బొర్లానికి చెందిన సాయవ్వ తన ఒక్కగానొక్క కొడుకు బాలయ్యతో.. కలిసి ఉంటోంది. బాలయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా.. సాయవ్వ అనారోగ్యంతో ఇంట్లో మంచానికి…