ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. ఎయిర్పోర్ట్ మరియు పారిశ్రామిక హబ్.. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్పోర్టు నిర్మాణానికి జూన్ 2వ తేదీన భూమిపూజ చేస్తామని సీఎం…