New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
ఎయిర్పోర్ట్ మరియు పారిశ్రామిక హబ్..
ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్పోర్టు నిర్మాణానికి జూన్ 2వ తేదీన భూమిపూజ చేస్తామని సీఎం ప్రకటించారు. కేవలం విమానాశ్రయమే కాకుండా, ఈ ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. అలాగే జిల్లాలో త్వరలోనే ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read:Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి..
ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేవలం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపబోమని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం చట్టసభల్లోనూ, బహిరంగ వేదికలపైనూ విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం కల్పిస్తోందని చెప్పారు.
తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును త్వరలోనే పునరుద్ధరించి ఆదిలాబాద్ రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. బాసర ఆలయాన్ని దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాను సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!