తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి తలంటు స్నానాలు అవుతున్నాయా? నేరుగా పచ్చి బూతులు తిట్టడం ఒక్కటే మిగిలిపోయిందా? ఎంత చెప్పినా మీరు మారరా... అంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి డ్యాష్ డ్యాష్ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోక్సభ ఎన్నికల వేళ టీ బీజేపీలో ఏం జరుగుతోంది?
కాడెడ్లలా కలిసి నడవాల్సిన, పార్టీని నడిపించాల్సిన వాళ్ళు కీచులాటలకు దిగుతున్నారు. కేరాఫ్ కలహాల కాపురంలా మారిందట వారి వ్యవహారం. నాకు ఒక కన్ను పోయినా ఫర్వేదు… ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలన్న సిద్ధాంతంతో పనిచేసిన ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చివరికి సవతి ముండమోయాలన్నట్టుగా మారిందట ఇద్దరి వ్యవహారం. ఎవరా ఇద్దరు నేతలు? ఏంటి వాళ్ళ కీచులాట కహానీ? ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలైతే…
ఎల్లుండి (20 వ తేదీ)నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు భాగ్యలక్ష్మి ఆలయం లో యాత్ర వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొత్తం 5 యాత్రలు చేపట్టనుంది తెలంగాణ బీజేపీ. అయితే.. ఎల్లుండి నాలుగు చోట్ల నుండి యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుండి కాకతీయభద్రాద్రి క్లస్టర్ యాత్ర ప్రారంభం కానుంది. రెండు యాత్రలను ఇద్దరు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఇందులో.. కొమురం భీం క్లస్టర్…
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్ర నాయకత్వం నాలుగు సిట్టింగ్ స్థానాలతో సహా 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని, మిగిలిన స్థానాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ హైకమాండ్కు పంపాల్సిన తుది జాబితా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు…
MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మహారాష్ట్రలో పోలీసు కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారంటూ గోషామహల్ ఎమ్మెల్యేపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana BJP: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పంపడం తెరిచి ఉంటుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆపనున్నారు.
Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కోసం బీజేపీ అగ్రనేతలు క్యూ కడతారని ప్రచారం జరుగుతోంది.
'సకల జనుల సౌభాగ్య తెలంగాణ' పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్నారు. బీసీ అభ్యర్థినే సీఎంను చేస్తామని ప్రకటించారు.
ఎల్లుండి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ మేనిఫెస్టోలో ఉండే అంశాలు మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉంది.