Tejaswini Gowda: లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నెల తర్వాత, బీజేపీకి చెందిన తేజస్విని గౌడ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరుతున్న క్రమంలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని ఆరోపించారు.