అమరావతిలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్తో ముందుకు సాగనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శాఖల పనితీరుపై ఆయన సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ వర్క్షాప్లో పాల్గొననున్నారు. జిల్లా కార్యవర్గాల కోసం ప్రత్యేకంగా…
పోసానిపై మరో ఫిర్యాదు అందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు..