రెండేళ్ల తరువాత మళ్లీ శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగనుంది. కరోనా వల్ల ఈ రెండేళ్ల పాటు భక్తులు లేకుండా కళ్యాణాన్ని నిర్వహించిన దేవస్తానం ఇప్పుడు మాత్రం భక్తుల సమక్షంలోనే కళ్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. శ్రీరాముడిని హోలీ పండుగ రోజే పెళ్లి కుమారుడిని చేయడం ఆనవాయితీ.. అదే ఆనవాయితీని ఈరోజు స్వామి వారి పెళ్ళికొడుకుని చేసిన అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలో…