టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం రెడీ అయింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానున్నారు. ఇప్పటికే నగరం అంతా గులాబీమయంగా మారింది. ఎటుచూసినా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. భాగ్యనగరం అంతా గులాబీనగరంగా మారిపోయింది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతం అంతా సందడిగా మారిందని చెప్పాలి. ప్లీనరీకి వచ్చే టీఆర్ఎస్…