కరీంనగర్ పట్టణంలోని వివిధ హోటళ్లలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృందాలు హోటళ్లలోని కిచెన్లు, స్టోర్రూమ్లలో సోదాలు నిర్వహించాయి. శ్వేత త్రీ స్టార్ హోటల్లో రూ.70,000 విలువ చేసే గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించామని అమృతశ్రీ తెలిపారు. హోటల్లో 20 నుంచి 25 రకాల వండిన ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అన్ని హోటళ్లలో దాడులు నిర్వహించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై…