AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించినట్లు, రేపు రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో, కొందరు జిల్లాల్లో వర్షాలు కురియనుండగా.. మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. పిడుగులతో కూడిన వర్షాలు.. మంగళవారం రోజు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం…
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.