శ్రీనివాస్రెడ్డి, ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఫస్ట్ లుక్, ట్రైలర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలైంది. దివ్యాంగులైన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? దాని నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, ‘వెన్నెల’ రామారావుకు కనపడదు.…
కమెడియన్ శ్రీనివాసరెడ్డి గతంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ వంటి సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటించాడు. వాటిలో ‘గీతాంజలి’ తప్ప ఏదీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్ళు’లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ అయింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుతరామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. విడుదలైన పోస్టర్ లో శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఉన్నారు.…