Puri jagannath temple: ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయం గురువారం 4 గంటల పాటు మూతపడనుంది. రహస్యమైన ‘‘బనకలగి’’ ఆచారం కోసం ఆలయ ద్వారాన్ని నాలుగు గంటల పాటు మూసేయనున్నారు. సాధారణ భక్తులను ఈ నాలుగు గంటలు గుడిలోకి అనుమతించరు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు.