శ్రీలంకలోని ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ‘లీట్రో గ్యాస్ లంక లిమిటెడ్’, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ ధరలు ఈరోజు (ఏప్రిల్ 05) అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం , ఇతర అంతర్జాతీయ పరిణామాల వల్ల గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల గ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.…