పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా…